అఫ్జల్ గురుకు ఉరి: కాశ్మీర్లో కర్ఫ్యూ
posted on Feb 9, 2013 10:30AM
తీవ్ర వాది అఫ్జల్గురుకు ఉరిశిక్ష అమలు చేసిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జమ్మూ -కాశ్మీర్ సహా అఫ్జల్గురు స్వస్థలం కాశ్మీర్లోని బారాముల్లాలోనూ పోలీసులు కర్ఫ్యూ విధించారు. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలహాబాద్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్గురును శనివారం ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లో అధికారులు ఉరితీశారు. ఈ కేసులో అఫ్జల్గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ తిరస్కరించారు. దాంతో అఫ్జల్గురుకు ఉరిశిక్ష అమలు చేశారు.